ఏసీబీ వలకు చిక్కిన అవినీతి అధికారి

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి అధికారి

c

శ్రీకాకుళం జిల్లాలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీకాకుళంలో ఇంటర్‌ మీడియట్‌ బోర్టు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి గుంటుకు రమణారావును ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. సోంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కాలేజ్‌లో కొత్త అడ్మిషన్ల పరిశీలన, అనుమతుల కోసం 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫైలుపై సంతకం కోసం ఆర్‌ఐఓ డబ్బులు డిమాండ్‌ చేస్తూ.. అక్టోబర్‌ 30వ తేదీ నుంచి పెండింగ్‌లో పెట్టారు.

దీంతో బాధితుడైన ప్రైవేటు కాలేజీ కరస్పాండెంట్‌ రామారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. శ్రీకాకుళం ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో డబ్బులు తీసుకుంటుండగా రమణారావును పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్‌ఐఓను కోర్టులో హాజరుపరిచారు.

Tags

Read MoreRead Less
Next Story