రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

X
By - TV5 Telugu |16 Nov 2019 5:49 PM IST
తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్. త్వరలోనే సభ్యులను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వచ్చే జూన్ నాటికి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేస్తామని తెలిపారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ఆధికారులను కేసీఆర్ ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా సమన్వయ సమితులను పటిష్టంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com