దొంగగా మారిన వార్డు వాలంటీర్
By - TV5 Telugu |19 Nov 2019 6:39 AM GMT
అందరికీ చేదోడువాదోడుగా ఉండాల్సిన ఓ వార్డు వాలంటీర్ దొంగగా మారాడు. ఓ వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పి ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో నల్లపూసల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది.
ఆకులవారి వీధికి చెందిన వార్డు వాలంటీర్ నరేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు M వరలక్ష్మి ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్డు వాలంటీర్ చైన్ స్నాచింగ్ చేయడంతో స్థానికులు షాక్కు గురయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com