వైసీపీ ఎమ్మెల్యే కారు బోల్తా..
By - TV5 Telugu |20 Nov 2019 2:27 AM GMT
శ్రీశైలం సమీపంలోని నంది ఘాటు మలుపు వద్ద పాణ్యం ఎమ్మెల్యేకి చెందిన కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వస్తే పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాటసాని అనుచరులు కారులో శ్రీశైలానికి బయల్దేరారు. నంది ఘాట్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com