జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు: సుజనా చౌదరి

X
By - TV5 Telugu |21 Nov 2019 5:39 PM IST
వైసీపీ ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జెరూసలేం వెళ్లేందుకు.. ఆర్థిక సాయం పెంచిన జగన్.. బద్రినాథ్, కేదార్నాథ్ వెళ్లేందుకు సాయం చేయాలని.. హిందువులు కోరితే ఏం చేస్తారని నిలదీశారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు, ఓట్ల మూడ్ లోంచి బయటకు వచ్చి పాలనపై ఫోకస్ చేయాలని సూచించారు సుజనా చౌదరి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com