ప్రతిపక్షాలను వేధించటం తప్ప.. 6 నెలల్లో చేసిందేమి లేదు: టీడీపీ

ప్రతిపక్షాలను వేధించటం తప్ప.. 6 నెలల్లో చేసిందేమి లేదు: టీడీపీ

babu

నేతలు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ 6 నెలల్లో ప్రతిపక్షంపై కక్షసాధింపులకు దిగడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు ఆ పార్టీ నేతలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఆర్థిక మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు.

టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే.. ఇప్పుడు అంతా నాశనం చేస్తున్నారని విమర్శించారు నేతలు. రాష్ట్రంలో మైన్స్, ఇసుక, లిక్కర్ ద్వారా వైసీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేదంపై ప్రకటనలు తప్పా.. ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశాలన్నింటిపైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సమావేశంలో నిర్ణయించారు. అటు పార్టీ సంస్థాగత ఎన్నికలపైనా చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story