ప్రియాంక రెడ్డి హత్యపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన
By - TV5 Telugu |30 Nov 2019 11:51 AM GMT
ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్యూఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుల దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ఫర్ ప్రియాంకారెడ్డి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రియాంకను హత్య చేసిన నిందితులను సమాజంలో బతనివ్వొద్దన్నారు. వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com