దేశంలో మహిళలకు హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి విన్నపం
By - TV5 Telugu |3 Dec 2019 9:21 AM GMT
దిశ ఉదంతంపై పార్లమెంట్ దద్దరిల్లింది. మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి దేశంలోని మహిళలకు ఓ విన్నపం చేశారు. ప్రతి ఒక్కరూ 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ యాప్ ను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకోవచ్చన్న ఆయన.. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, రైల్వే పోలీసులు, విమానాశ్రయాల్లోనూ సీఐఎస్ఎఫ్ పోలీసులు స్పందిస్తారుని తెలిపారు. 112 హెల్ప్ లైన్ ను నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలకూ నిధులను కూడా అందించినట్లు తెలిపారు కిషన్రెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com