కియా సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటాం : సీఎం జగన్

కియా సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటాం : సీఎం జగన్

ys-jagan-2

కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని చెప్పారు సీఎం జగన్. సంస్థ మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 లక్షల యూనిట్లకు చేర్చడం ద్వారా.. మరింత మందికి ఉపాధి కల్పించాలన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కియా మోటర్స్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలోనే మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

అంతకుముందు కియా పరిశ్రమలోని అన్ని విభాగాలను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆయన వీక్షించారు. 13 వేల 500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story