మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు: బీజేపీ లక్ష్మణ్
By - TV5 Telugu |13 Dec 2019 7:58 AM GMT
తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు లక్ష్మణ్. ఉద్యమంలో కష్టపడ్డ ఉద్యోగులను కూడా మోసం చేశారన్నారు. మహిళలకు భధ్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. హరితహారం పేరుతో వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com