ఓ వైపు తీవ్ర ఇబ్బందులు.. మరోవైపు కొత్త అందాలు..
By - TV5 Telugu |13 Dec 2019 5:30 AM GMT
ఉత్తరాఖండ్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ప్రసిద్ధ కేధార్నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచుమయమైపోయాయి. అటు.. హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటి కప్పుకుంది. సిమ్లా జిల్లాలోని నర్కాండా ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆలయ పరిసరాలన్నీ మంచు ఫలకాలుగా మారిపోయాయి. ప్రస్తుతం అక్కడ మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగత్ర ఉంది. మరోవారం రోజుల పాటు కూడా జ్యోతిర్లింగ క్షేత్రంలో భారీ మంచు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మంచుదుప్పటిగా మారిన హిమాచల్ ప్రదేశ్ కొత్త అందాలను సంతరించుకుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com