తమిళనాడులో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలుగు భవనాలు కుప్పకూలాయి. దీంతో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మత్య్సకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com