జగన్ మాటలు కోటలు దాటినా.. చేతలు గడపలు దాటడం లేదు: చంద్రబాబు

జగన్ మాటలు కోటలు దాటినా.. చేతలు గడపలు దాటడం లేదు: చంద్రబాబు

babu

సీఎం జగన్‌ మాటలు కోటలు దాటుతున్నాయని.. పనులు మాత్రం గడప కూడా దాటడం లేదని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలికతో పాటు ఆమె కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈ ఘటన బాధాకరమని.. తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చట్టాలు తేవడం ఎంత ముఖ్యమో.. ఆ చట్టాలు అమలు చేయడంలోనూ ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలన్నారు. బాలికపై అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని సీఎం జగన్‌ ను నిలదీశారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఇంత వరకు రాలేదని ఆక్షేపించారు. నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించినపుడే మిగిలిన వారికి భయం పుడుతుందన్నారు

అత్యాచార బాధితురాలిని చూస్తే గుండె తరుక్కుపోతోందని.. ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ తరఫున 50వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. బాధితురాలి పేరిట 25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని.. ఉన్నత చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించాలని కోరారు. A.N.Mగా పనిచేస్తున్న బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం కేటాయించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story