అత్యాచారానికి గురైన విద్యార్థికి ప్రియుడి సలహా..
By - TV5 Telugu |16 Dec 2019 7:43 AM GMT
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై రాజు అనే దుండగుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగింది అంటూ ప్రియుడుకి ఫిర్యాదు చేసింది ఆ విద్యార్థిని. వెంటనే ఆవేశంతో ఊగిపోయిన ప్రియుడు.. ఆమె ఇక చనిపోవడమే మంచిదని సలహా ఇచ్చాడు. ప్రియుడి సలహాతో ఆ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అత్యాచారం చేసిన రాజు, ఆమె ప్రియుడు ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com