అలీని పరామర్శించిన చిరంజీవి

అలీని పరామర్శించిన చిరంజీవి

CHIRU

నటుడు అలీని.. చిరంజీవి పరామర్శించారు. గురువారం తెల్లవారుజామున అలీ తల్లి చనిపోయారు. రాజమహేంద్రవరంలోని ఆయన సోదరి నివాసంలో ఉన్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని అలీ ఇంటికి తీసుకొచ్చారు. తల్లి చనిపోయిందన్న వార్త విన్న అలీ.. రాంచీ నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి.. అలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిరంజీవితో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు, పలువురు సినీ నటులు అలీని పరామర్శించారు.

మరోవైపు అలీ తల్లి కన్నుమూశారని వార్త తెలిసి బాధపడ్డానని, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అలీకి తన తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో తనకు తెలుసని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story