ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హాజరైన సమత కేసు సాక్షులు
By - TV5 Telugu |23 Dec 2019 9:19 AM GMT
ఆదిలాబాద్ జిల్లా సమత కేసు విచారణలో భాగంగా.. సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్డుకు సాక్షులు హాజరయ్యారు. ఏడుగురు సాక్షులతో పాటు సమత కుటుంబ సభ్యులు కోర్టుకు వచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను కూడా.. కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. గత నెల 24న సమతను దారుణంగా హత్యచేసిన ఈ ఘటనలో.. సోమవారం నుంచి 44 మంది సాక్షులను కోర్టు విచారించనుంది. ఈ నెలాఖరు వరకు సాక్షుల విచారణ పూర్తి చేయనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com