అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే.. ఆధారాలతో నిరూపించండి: రఘునాథ్ బాబు
By - TV5 Telugu |25 Dec 2019 1:20 PM GMT
అమరావతి రాజధానికి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ ఆమోదం తెలిపారని.. అధికారంలోకి వచ్చాక మాట తప్పడం సరికాదని టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు అన్నారు. రాజధానిపై ఏకాభిప్రాయం కాస్త ఏకపక్ష నిర్ణయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారాయన. గుంటూరు జిల్లా నర్సరావు పేటలో వాజ్పేయి 96వ జయంతి వేడుకల్లో రఘునాథ బాబు పాల్గొన్నారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మించిన తర్వాత రాజధాని ఎలా మారుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే.. ఆధారాలు బయటపెట్టి.. కేసులు నమోదు చేయాలని సూచించారు. రాజధాని మార్చాలనే అనుకుంటే.. 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయం సేకరించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com