గుంటూరులో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

గుంటూరులో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

baby-gnt

గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఆడుకుంటుండగా పై పోర్షన్‌లో ఉండే లక్ష్మణరెడ్డి అనే యువకుడు.. చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. నగరంపాలెం పోలీసులను బాధిత తల్లిదండ్రులు ఆశ్రయించగా.. నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ బాలిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతుంది.

ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దళితులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వచ్చి బాలికను పరామర్శించాలని.. అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఇదే జిల్లాకి చెందిన హోంమంత్రి ఎందుకు రాలేదని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. నిందితుడి లక్ష్మణ్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దిశ చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తుందని వాసిరెడ్డి పద్మ చెప్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story