క్లియరెన్స్ సేల్.. భారీ డిస్కౌంట్లో కార్లు..
మీరు కొనాలనుకున్న కారు మరీ రేటు ఎక్కువగా ఉందని వదిలేశారేమో. మరి మీలాంటి వారి కోసమే కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. హ్యుందాయ్, ఫోర్డ్ కంపెనీలతో పాటు మహీంద్రా కంపెనీ కూడా భారీ డిస్కౌంట్తో పాటు మరికొన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తున్నాయి. మహీంద్రా కంపెనీ తన కార్లపై రూ.4 లక్షల వరకు ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ స్టాక్ని క్లియర్ చేసుకోవడం, బీఎస్ 4 ప్రొడక్ట్ను తగ్గించుకోవడం లక్ష్యంగా పనిచేస్తోంది.
తన ఎస్యూవీలను బీఎస్ 6కు అప్గ్రేడ్ చేయాలని భావిస్తోంది. మహీంద్రా ఎక్స్యూవీ 300, మొరాజో, అల్టాస్ వంటి మోడళ్లపై కొనుగోలుదారులు ఏకంగా రూ.4 లక్షల వరకు తగ్గింపు ఉంది. టీయూవీ 300 కారుపై రూ.75,000 వరకు, ఎక్స్యూవీ 300 కారుపై రూ.70,000 వరకు బెనిఫిట్ ఉంది. మొరాజో ఎంపీవీపై రూ.171 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. స్కార్ఫియో మోడల్పై రూ.60,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఎక్స్యూవీ 500 7 సీటర్ మోడల్ కొనుగోలు చేస్తే రూ.84,000 వరకు ప్రయోజనం లభిస్తుంది. కంపెనీ ప్లాగ్షిప్ ఎస్యూవీ అల్టాస్ జీ4 కారుపై ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. మీరు మహీంద్రా బొలెరో కారు కొనుగోలు చేయాలనుకుంటే రూ.47,000 వరకు ఆదా అవుతుంది. డిసెంబర్ 31 వరకు మాత్రం ఈ తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. డిస్కౌంట్లు, ఆఫర్లు డీలర్షిప్ని బట్టి కూడా మారే అవకాశం ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com