తెలంగాణలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలాచోట్ల బుధవారం కూడా డబ్బుల పంపిణీ చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో పలు పోలింగ్ బూత్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ -టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. మరికొందరు తమ ఓట్లు గల్లంతయ్యాయని, తమ ఓట్లను వేరే వారు వేశారంటూ పోలింగ్ బూత్ల దగ్గర ఆందోళనకు దిగారు..
120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు గంటల వరకు రాష్ట్రం వ్యాప్తంగా 70 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. ఆదిబట్ల, చౌటుప్పల్లో అత్యధికంగా 85 శాతం పోలింగ్ నమోదైంది. ఇటు నిజాంపేట్లో అత్యల్పంగా 33.6 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com