తెలంగాణలో మున్సిపల్‌ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి

తెలంగాణలో మున్సిపల్‌ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తయింది.. వార్డుల వారీగా రిజర్వేషన్లను అధికారులు పూర్తిచేశారు.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకుంది.. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపారు అధికారులు.. ఇక రేపు వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story