ఏడాదిన్నరలో భారతి సీఎం అవ్వొచ్చు: జేసీ దివాకర్ రెడ్డి

అమరావతిలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నమ్మకాన్ని కోల్పోయాడని.. ఓ ఏడాది, ఏడాదిన్నరలో భారతి ముఖ్యమంత్రి కావచ్చన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన జేసీ.. కులద్వేషం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని.. సీఎం అవుతూనే రాజధానిని మార్చాలని జగన్ అనుకున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో జగన్కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని.. అందుకే కేసీఆర్ విషయంలో జగన్ గురుభక్తి చాటుకున్నారని అన్నారు జేసీ
విశాఖలో రాజధాని పెట్టాలంటే జగన్ ఒక్కరే నిర్ణయం తీసుకుంటే సరిపోదని.. అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు జేసీ దివాకర్రెడ్డి. ఒక కులం, ఒక వ్యక్తిపై ద్వేషంతో రాజధాని మార్చడం సరికాదన్నారు. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపించిన జేసీ.. గత 7 నెలలుగా విశాఖలోనే విజయసాయిరెడ్డి తిష్ట వేశారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com