మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీకి కొత్త జెండా
By - TV5 Telugu |24 Jan 2020 11:19 AM GMT
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన-MNS రూపురేఖలు మారుతున్నాయి. పూర్తిగా హిందూత్వ దిశగా MNS అడుగులు వేస్తోంది. తాజాగా MNS జెండా మారింది. పతాకం పూర్తిగా కాషాయం రంగులో తీర్చి దిద్దారు. కాషాయం రంగుపై నలుపురంగులో అష్టభుజి, దానిపై పసుపు రంగు అక్షరాలతో రాజముద్రను ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పరిపాలనాకాలంలో ఇలాంటి రాజముద్రను ఉపయోగించేవారని సమాచారం. గతంలో MNS జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఇప్పుడు కాషాయం, నలుపు, పసుపు రంగులతో కొత్త జెండాను ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com