ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి‌ పొందగా మరి కొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అదనపు డీజీగా ఆర్‌ కే మీనా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్‌.. మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్‌.. ప్రొవిజినల్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌..ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి.. ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌.. గుంటూరు రేంజ్‌ ఐజీగా జె. ప్రభాకర్‌రావు.. ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌.. ఏలూరు రేంజ్‌ డీఐజీగా కేవీ మోహన్‌ రావులు అలాగే మరికొంతమంది పదోన్నతి పొందారు.

అంతేకాదు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌.. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా హరీష్‌కుమార్‌ గుప్తా.. ఎపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి,నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్‌.. ఎపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి. క్రిష్ణారావులు బదిలీ అయ్యారు. అయితే వీరిలో వినీత్ బ్రిజ్‌లాల్‌కు ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story