గోడ పగలగొట్టి మద్యం దొంగతనం
By - TV5 Telugu |4 April 2020 11:10 PM GMT
రూమ్ గోడలు పగలగొట్టి దుండగులు మద్యం దొంగతనం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ వైన్స్ షాపులో దుండగులు మద్యం దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణం వెనుక నుంచి రంద్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ. లక్ష విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com