ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి: కోదండరాం
By - TV5 Telugu |19 April 2020 3:19 PM GMT
రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ను కొనసాగించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. అయితే.. దీనికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వం అందరిని కలుపుకొని పనిచేయాలని అన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. అసంఘటితరంగాన్ని, చిన్న పరిశ్రమలను పునరుద్ధరించాలని తెలిపారు. పేదలకు ప్రభుత్వం రూ.5వేల ఆర్థిక సాయం చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com