అర్నాబ్ గోస్వామిపై జరిగిన దాడి అమానుషం: చంద్రబాబు

అర్నాబ్ గోస్వామిపై జరిగిన దాడి అమానుషం: చంద్రబాబు

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నా దాడులను అడ్డుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆయన కోరారు.

సీనియర్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, అతని భార్యతో కారులో వెళుతుండగా బుధవారం రాత్రి వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మోటారు సైకిలుపై వచ్చిన ఇద్దరు దుండగులు కారుపై నల్ల సిరా చల్లి అక్కడి నుంచి పరారయ్యారని.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అర్నాబ్ పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. తనపైజరిగిన దాడికి సోనియాగాంధీ బాధ్యత వహించాలని అర్నాబ్ డిమాండ్ చేశారు.ఈ దాడి కాంగ్రెస్ కార్యకర్తల పని అని అర్నాబ్ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story