టిక్‌టాక్ తల్లీ కొడుకుల్ని చంపేసింది..

టిక్‌టాక్ తల్లీ కొడుకుల్ని చంపేసింది..

టిక్‌టాక్ ఓ కుటుంబంలో విషాదం నింపింది. విజయవాడ జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్య అస్తమాను టిక్ టాక్‌లు చేస్తూ ఇల్లు, పిల్లల్ని పట్టించుకోవడం మానేసిందని మందలించాడు. భర్త మందలించడాన్ని అవమానంగా భావించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మమరణాన్ని జీర్ణించుకోలేని కుమారుడు కూడా సైనెడ్ తాగి మృతిచెందాడు. నిమిషాల వ్యవధిలో తల్లి, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చుని టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేయడం కొన్ని కుటుంబాల్లో గొడవలకి, మరికొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలకు కారణమైంది.

Tags

Read MoreRead Less
Next Story