ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడింది.. సుమోటోగా కేసు స్వీకరిస్తున్నాం: ఏపీ హైకోర్టు

ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడింది.. సుమోటోగా కేసు స్వీకరిస్తున్నాం: ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులపై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్‌ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. జీవో నెం.623ని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. రంగుల అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని హైకోర్టు తెలిపింది. సీఎస్, ఈసీ, పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 28న సుమోటో కేసు విచారణకు వచ్చే అవకాశముంది.

ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే.. ప్రభుత్వం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనంటూ సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కార్యాలయాలకు వేస్తున్న రంగులు వైసీపీ జెండాను పోలిన విధంగా ఉన్నాయని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించడం లేదని కోర్టుకు వివరించారు.

దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. 3 రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని వాదించారు. ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన జీవోను రద్దు చేస్తూ.. సీఎస్‌, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story