పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. ఇళ్లపై కుప్ప కూలిన విమానం

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. ఇళ్లపై కుప్ప కూలిన విమానం

ఒకే ఒక్క నిమిషంలో ల్యాండ్ కావలసి ఉంది. అంతలోనే ఘోరం జరిగిపోయింది. కరాచి విమానాశ్రయం వద్ద పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్ప కూలినట్లు అధికారులు వెల్లడించారు. లాహోర్ నుంచి కరాచీకి వచ్చిన విమాన ఎయిర్‌లైన్స్ను పీకే-303గా అధికారులు నిర్ధారించారు. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని మోడల్ కాలనీలో ఉన్న ఇండ్లపై ఈ విమానం కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణీకులలో పాటు 16 మంది సిబ్బంది ఉన్నట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఆ ప్రాంతంలో ఎంత మంది నివసిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. నాలుగు భవనాలు పూర్తిగా దెబ్బ తినడంతో ప్రమాదం భారీ స్థాయిలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలిలో ఆర్మీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story