యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎస్మా చట్టం ప్రయోగం

యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎస్మా చట్టం ప్రయోగం

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ఎస్మా చట్టం ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వం శాఖలు, కార్పోరేషన్లపై ఈ చట్టం అమలు ఉంటుందని ప్రకటించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రంలో ప్రజా సేవలు నిలిపివేయడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఆధీనంలోని ఎలాంటి సేవలైనా నిలిపివేయడాన్ని నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఎవరైనా.. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా సమ్మెకు దిగితే.. ఏడాది జైలు శిక్ష గానీ.. వెయ్యి రూపాయలు జరిమానా గానీ విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం కూడా ఉంది. సమ్మెకు ప్రోత్సహించిన వారిని అరెస్ట్ వారెంట్ లేకుండా.. అదుపులోకి తీసుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story