అంఫన్ తుపాన్ బాధితులకు సాయం ప్రకటించిన ఈయూ
By - TV5 Telugu |23 May 2020 5:22 PM GMT
అంఫన్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకొనేందుకు యూరోపియన్ యూనియన్.. భారత్ కు ఐదు లక్షలు సాయం ప్రకటించింది. తుఫానుతో పాటు కరోనాతో పోరాడుతున్న వైద్యరక్షణ కోసం తక్షణ సాయంగా 5 లక్షల కోట్లు యూరోలు అందిస్తున్నట్టు ఈయూ కిషనర్ తెలిపారు. తొలి విడతగా ఈ నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ తుఫాన్ ప్రభావం బెంగాల్లో ఎక్కువగా ఉంది. భారీ ఆస్తి నష్టంతో పాటు పెద్ద ఎత్తున 80 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యూరోపియన్ యూనియన్ భారత్ తోపాటు బంగ్లాదేశ్ కు కూడా సాయం అందించింది. బంగ్లాదేశ్ లో ఎక్కువ నష్టం ఉండటంతో 1.1 కోట్ల యూరోల సాయం ప్రకటించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com