కువైట్ నుంచి కడపకు చేరుకున్న 112 మంది.. నలుగురిలో వైరస్ లక్షణాలు

కువైట్ నుంచి కడపకు చేరుకున్న 112 మంది.. నలుగురిలో వైరస్ లక్షణాలు

కువైట్ నుంచి ఎట్టకేలకు కడప జిల్లాకు చేరుకున్నారు 112 మంది ప్రవాసాంధ్రులు. వీరంతా ముందుగా హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట వచ్చారు. అక్కడి నుంచి 5 బస్సుల్లో అందరినీ రాజంపేట క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వీరిలో కాస్త అనారోగ్యంతో కనిపిస్తున్న 8 మందికి వైద్య పరీక్షలు చేయగా.. నలుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వెంటనే వారిని కడప ఫాతిమా కాలేజీకి తరలించారు. అక్కడ మరోసారి పరీక్షలు చేశాక.. పాటిజివ్‌గా నిర్థారణ అయితే ప్రత్యేక వార్డుల్లో ఉంచి కరోనా చికిత్స అందిస్తారు. కువైట్ నుంచి జిల్లాకు వచ్చిన వారిలో 25 మండలాలకు చెందిన 112 మంది ఉన్నారు. వీరంతా 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత.. ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకపోతే ఇళ్లకుపంపిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story