భారత్, చైనా బోర్డర్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్ నరవాణే

భారత్, చైనా బోర్డర్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్ నరవాణే

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే వాస్తవిక నియంత్రణ రేఖ వెంబడి పర్యటించారు. ఇటీవల భారత్, చైనా బోర్డర్ లో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బోర్డర్ వెంట పర్యటించారు. లేహ్‌ ప్రాంతంలోని 14 సైనిక బృందాలకు చెందిన ముఖ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉన్నత స్థాయి కమాండర్‌లు నరవాణేకు అక్కడి పరిస్థితులను వివరించారు. చైనా సైనికులు, భారత సైనికుల మధ్య జరిగిన ప్రతి విషయాన్ని ఆయనకు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story