అనిల్ అంబానీకి లండన్ కోర్టులో షాక్

అనిల్ అంబానీకి లండన్ కోర్టులో షాక్

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి మరోషాక్ తగిలింది. చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 700 మిలియన్ల డాలర్లు(రూ.5,440 కోట్లు) త్వరలోనే 21 రోజుల్లో చెల్లించాలని లండన్ కోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా సహా మరో మూడు బ్యాంకుల నుంచి ఈ మొత్తంలో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కోసం 2012లో అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో అనిల్ అంబానీ తన వ్యక్తిగత పూచీకత్తుతో లోన్ పొందారని న్యాయమూర్తి తెలిపారు. అయితే, అనిల్ అంబానీ మాత్రం తన వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టలేదని.. తన ఆస్తి విలువ జీరో ఉందని అంటున్నారు. కాగా, కోర్టు 21 రోజులు సమయం ఇవ్వడంతో ఏం చేస్తారో చూడాలి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. తన సోదరుడు ముఖేష్ అంబాని.. అనిల్ అంబానీ బకాయిలు చెల్లించడంతో జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story