నోకియా ప్లాంట్‌లో 42 మందికి కరోనా.. ప్లాంట్ క్లోజ్

నోకియా ప్లాంట్‌లో 42 మందికి కరోనా.. ప్లాంట్ క్లోజ్

తమిళనాడులో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్నఒక్కరోజే 646 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 17,728కి చేరగా, 127 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా శ్రీ పెరంబదూర్‌లో ఉన్న నోకియా ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

కంపెనీలో మొత్తం 42 మందికి కరోనా వైరస్ సోకిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపులతో ఈ ప్లాంట్ గత కొన్ని రోజుల క్రితమే తిరిగి తెరుచుకుంది. భారీ సంఖ్యలో కేసులు బయటపడడంతో కంపెనీని తాత్కాలికంగా మూసివేసి పారిశుద్ద్య చర్యలు చేపట్టామని సంస్థ ప్రకటించింది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం.. కార్యాలయాల్లో పని చేసే వ్యక్తుల్లో వైరస్ బయటపడుతుండడం, వాటిని ఎదుర్కోవడం కంపెనీలకు ఒక సవాలుగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story