బెజవాడ గ్యాంగ్వార్లో బయటపడుతున్న సంచలన నిజాలు
తీవ్ర సంచలనం రేపిన బెజవాడ గ్యాంగ్వార్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తోట సందీప్, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతో పాటు.. వ్యక్తిగత పోరు ఉన్నట్లు గుర్తించారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని వివాదాస్పద భూముల వ్యవహారంలో ఈ రెండు వర్గాల జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. బెజవాడలో ల్యాండ్ సెటిల్మెంట్లకు గుంటూరు జిల్లా నుంచి యువకులను.. గుంటూరు జిల్లాలో వివాదాలకు బెజవాడ యువకులను ఈ రెండు గ్యాంగ్లు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.. ఇతర ప్రాంతాల వారిని తీసుకొస్తే పోలీసులు అంత త్వరగా గుర్తించరని ఇలా చేసినట్లు సమాచారం. సందీప్, పండు గ్యాంగ్వార్లో రెండు జిల్లాలకు చెందిన యువకులు పాల్గొన్నట్లు తేల్చారు. ఈ ఇద్దరికీ ఉన్న టిక్టాక్, ఫేస్బుక్ అకౌంట్ల ఫాలోవర్స్ కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.
అటు పండు ఆలియాస్ మణికంఠ చేసిన కొన్ని టిక్టాక్ వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. విజయవాడలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో తీవ్రంగాగాయపడ్డ తోట సందీప్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పండు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పటమట ఏరియాలో తీవ్ర కలకలం రేపిన ఈ స్ట్రీట్ ఫైట్లో 30 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com