పాక్‌లో కరోనా కలకలం.. మాజీ క్రికెటర్ అఫ్రిదికి పాజిటివ్

పాక్‌లో కరోనా కలకలం.. మాజీ క్రికెటర్ అఫ్రిదికి పాజిటివ్

పాకిస్థాన్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకూ పాక్ లో లక్షా 30 వేలకు పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి. అటు, పాక్ క్రికెటర్లకు కూడా వరుసగా కరోనా పాజిటివ్ నమోదవుతున్నాయి. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా అని తేలింది. ఈ విషయాన్ని అఫ్రిది స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. ఆయన ఇస్లామాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనాతో పోరాడి పాక్ మాజీ క్రికెటర్లు రియాజ్ షేక్, జాఫర్ సర్ఫరాజ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఫ్రిదికి కరోనా పాజిటివ్ రావటంతో అటు క్రికెటర్లలలో, ఇటు పాక్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల కాశ్మీర్ విషయంలో అఫ్రిది భారత ప్రధాని మోదీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story