సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం : కేసీఆర్

సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం : కేసీఆర్

చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర రక్షణ మంత్రి ద్వారా అందిస్తామని సిఎం వెల్లడించారు.

సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని..తద్వారా సైనికుల్లో ఆత్మ విశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలన్నారు. దేశమంతా మీ వెంటనే ఉందనే సందేశం అందించాలన్నారు. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలని... ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్ అందించిన భరోసాపై కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తంపు ఇచ్చిందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story