వైసీపీ నేత పీవీపీపై కేసు నమోదు

వైసీపీ నేత పీవీపీపై కేసు నమోదు

వైసీపీ నేత పీవీపీపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పీవీపీపై కైలాష్‌ విక్రం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు..తనపై గుండాలతో దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదు చేశారు. 40 మంది అనుచరులతో తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. టెర్రస్‌పై గార్డెన్‌ కట్టొద్దని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏడాది క్రితం పీవీపీ విల్లాస్‌లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్ విక్రం. అయితే కొనుగోలు సమయంలో ఎలాంటి రూల్స్ చెప్పలేదని అంటున్నారు కైలాష్... ఇప్పుడు టెర్రస్‌పై గార్డెన్‌ నిర్మిస్తుంటే వద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు..గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. కైలాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బంజారాహిల్స్‌ పీఎస్‌లో పీవీపీని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story