కాంగ్రెస్‌ను చైనా నడిపిస్తోందా?- రవిశంకర్ ప్రసాద్‌

కాంగ్రెస్‌ను చైనా నడిపిస్తోందా?- రవిశంకర్ ప్రసాద్‌

చైనాకు భారత్‌ ప్రభుత్వం సరెండ్ అయిందని.. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై.. బీజేపీ నేతలు స్వరం మరింతగా పెంచారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌.. మరింత ధీటుగా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. 2005-06 సంవత్సరాల్లో.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు.. భారత్‌లోని చైనా ఎంబసీ నుంచి నిధులు అందాయని ఘాటుగా ఆరోపించారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ యాన్యువల్‌ రిపోర్ట్‌లో ఆ నిధుల వివరాలున్నాయని రవిశంకర్ కౌంటర్ ఎటాక్ చేశారు. ఆ లెక్కన.. UPA ప్రభుత్వం చైనా నుంచి లంచం తీసుకున్నట్టు అనుకోవాలా అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వ రికార్డుల్లో నాటి UPA ప్రభుత్వం ఎందుకు చూపలేదన్నారు. చైనా ఎంబసీ నుంచి నిధులు ఎందుకు తీసుకున్నారో.. వాటిని ఎలా ఉపయోగించారో చెప్పాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. చైనా నిధులతోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story