తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై31 వరకూ లాక్‌డౌన్

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై31 వరకూ లాక్‌డౌన్

తమిళనాడు ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు కరోనా పెరుగుతుండటంతో లాక్ డౌన్ జూలై31 వరకూ పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. చెన్నై, మధురై నగరాల్లో లాక్ డౌన్ ప్రస్తుతం అమలులో ఉంది. అయినప్పటికీ.. కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటంలేదు. దీంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు తమిళనాడులో కొత్తగా 3949 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన రోజువారీ కేసుల్లో ఇవే ఎక్కువ. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో జూలై 31వరకు లాక్‌డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story