మహారాష్ట్రతో పోటీపడుతున్న తమిళనాడు కరోనా కేసులు

మహారాష్ట్రతో పోటీపడుతున్న తమిళనాడు కరోనా కేసులు

కరోనా మహమ్మారి తమిళనాడును కలవరపెడుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు మహారాష్ట్రతో పోటీ పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3949 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 86,224కు చేరింది. అటు మరణాలు కూడా బారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 62 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో కరోనా మరణాలు 1141కి చేరింది. ఇప్పటి వరకూ 47,749 మంది కరోనా నుంచి కోలుకోగా.. 37,331 చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కట్టడికి చెన్నైలో మళ్లీ లాక్ డౌన్ విధించినా.. దాని ప్రభావం ఏమాత్రం కనిపించడంలేదు.

Tags

Read MoreRead Less
Next Story