ఏపీలో 837 కొత్త కేసులు.. 8 మరణాలు

ఏపీలో 837 కొత్త కేసులు.. 8 మరణాలు

ఏపీ కరోనా బులిటెన్ ను ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 16,934కి చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో 789మంది ఏపీలో ప్రజలు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 46 మంది కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరని ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా.. రాష్ట్రంలో కరోనా మృతులు 206కి చేరాయి. మొత్తం కేసుల్లో 7,632 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 9096 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story