తెలంగాణలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,892 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,892 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 1,658 మంది కరోనా బారిన పడ్డారు.

ఇక రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌మల్కాజిగిరి 44, వరంగల్‌రూరల్‌ 41, సంగారెడ్డి 20 కేసులు నమోదయ్యాయి. నల్లగొండ 13, మహబూబ్‌నగర్‌ 12, మహబూబాబాద్‌ 7, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 6 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం 4, సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌ 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. నిర్మల్‌, ఖమ్మం 2 చొప్పున, కరీంనగర్‌, జోగుళాంబ గద్వా ల, ములుగు, జగిత్యాల, వరంగల్‌అర్బన్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

కరోనా బారి నుండి 1,126 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఎనిమిది మంది ప్రా ణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,462 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 283 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story