జీతం ఇవ్వమన్నందుకు శునకాన్ని మీదకు వదిలిన యజమాని..

జీతం ఇవ్వమన్నందుకు శునకాన్ని మీదకు వదిలిన యజమాని..

చేసిన పనికి జీతం అడిగినందుకు బ్యూటీపార్లర్ యజమాని రజని ఉద్యోగినిపైకి తన పెంపుడు శునకాన్ని వదిలింది. అందానికి మెరుగులుదిద్దే ఆమె తన మనసు ఎంత అందవిహీనంగా ఉందో తెలుసుకోలేకపోయింది. ఈ దారుణమైన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. సప్నా అనే మహిళ దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్ ప్రాంతంలో ఉన్న బ్యూటీపార్లర్ లో లాక్‌డౌన్ విధించడానికి ముందు నెలన్నర రోజులు పని చేసింది. తాను పని చేసిన రోజులకు జీతం బకాయిలు ఇవ్వమని ఇటీవల రజనీకి ఫోన్ చేసి అడిగింది. దానికి ఆమె ఇంటికి రా ఇస్తాను అని సప్నాకు చెప్పింది.

జీతం డబ్బుల కోసం ఇంటికి వచ్చిన సప్నాను ఇంట్లో పని చేయాలని కోరింది రజని. దానికి ఆమె నిరాకరించడంతో సప్నాపైకి తన పెంపుడు శునకాన్ని వదిలింది. శునకం ఆమెపై దాడి చేస్తుంటే చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందిందే కానీ కట్టడి చేయలేదు. దాంతో సప్నాని శునకం కరవడంతో ముఖం, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు సప్నా.. మదన్ మోహన్ మాలవీయ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు ఆమెను సప్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. శునకం గాట్లు పడిన ప్రాంతంలో వైద్యులు సప్నాకు 15కుట్లు వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రజనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story