కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుగ్గన భేటీ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుగ్గన భేటీ

ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి రావలసిన పీడీఎస్, జీఎస్టీ పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్ గ్రాంటు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, అలాగే పెండింగ్ బకాయిల విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా పడిపోయిందని పెండింగ్ నిధులను త్వరగా విడుదల చెయ్యాలని నిర్మలా సీతారామన్ ను కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితోను మంత్రి బుగ్గన భేటీ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story