తెలంగాణలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 1,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 762 కేసులు నిర్థారణ అయ్యాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 32,224 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 339 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారి నుండి కోలుకుని 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే 1,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story