వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు.. పెద్దల సాక్షిగా ఏడడుగులు

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు.. పెద్దల సాక్షిగా ఏడడుగులు

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు.. ఒకే కల్యాణ మండపంలో వీరి పెళ్లి జరిగింది. ఒకరు ప్రేమించిన యువతి.. మరొకరు పెద్దలు చూసిన అమ్మాయి.. ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు యువకుడు. మధ్యప్రదేశ్‌ జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్ఛనీయాంశమైంది.

గూడడొంగ్రీ బ్లాక్ కేరియా గ్రామానికి చెందిన సందీప్ చదువుకునే సమయంలో హోసంగబాద్‌కి చెందిన యువతితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే సందీప్ ఇంట్లో పెద్దలు మాత్రం కోయలరీ గ్రామానికి చెందిన మరో యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. ఈ సమయంలో సందీప్ ప్రేమ విషయం బయటపడింది. దీంతో ఈ వ్యవహారం పంచాయితీకి చేరింది.

ఆ పంచాయతీలో సందీప్‌ను ఇద్దరు అమ్మాయిలు కోరుకున్నారు. దానికి కుటుంబ సభ్యులు కూడా మద్దతు పలికారు. పంచాయతీ పెద్దలు సైతం అలాగే తీర్పునిచ్చారు. దీంతో జూలై 8న హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరితో కలిసి సందీప్ ఏడు అడుగులు నడిచాడు.

Tags

Read MoreRead Less
Next Story