కొండచరియలు విరిగిపడడంతో 12 మంది మృతి

పశ్చిమ నేపాల్లో కుండపోతగా కురిసిన వర్షాలకు గురువారం వేర్వేరు కొండచరియలు విరిగి 12 మంది మరణించారు. 19 మంది ఆచూకీ లభించలేదు. గాయాల కారణంగా 10 మంది చికిత్స పొందుతున్నారు. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణి, ఇతర ప్రధాన నదులు విపరీతంగా పొంగిపొర్లుతున్నాయి. రాబోయే మూడు రోజులకు రుతుపవనాల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కస్కి జిల్లాలోని పోఖారా సిటీ ప్రాంతంలోని సారంగ్కోట్, హేమ్జన్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వారిలో 5 మంది కొండచరియలు విరిగి పడటంతో చనిపోయారు. చికిత్స పొందుతున్న 10 మంది కూడా ఇక్కడే గాయపడ్డారు. అంతేకాదు లామ్జంగ్ జిల్లా బసిషాహర్లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రుకుం జిల్లాలోని అత్బిస్కోట్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com